క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట

క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన  బీజేపీ నేతలు.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట

మేడ్చల్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇటీవల పంపిణీ చేసిన ఇళ్లలో స్థానికులకు ఇళ్లు రాలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడికి సెప్టెంబర్ 4న బీజేపీ పిలుపునిచ్చింది. 

విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంప్​ ఆఫీస్​ చుట్టూ భారీ బందోబస్తు పెంచారు. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేస్తూ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు ఎక్కడివారినక్కడ అరెస్ట్​ చేశారు. 

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్​ రెడ్డితో పాటు మరో 25 మంది ఉన్నారు. వారందరినీ ఘట్కేసర్​ పోలీస్​ స్టేషన్​ కి తరలించారు.