
లింగంపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రం లో బీజేపీ లీడర్లు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ రైతన్నలు ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కేంద్ర సర్కార్ మద్దతు ధర పెంచిందన్నారు. వరి ధాన్యం క్వింటాలుకు రూ.69 పెంచిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు మహరాజుల మురళీ, బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దిశివయ్య, లింగంపేట మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో..
కామారెడ్డిటౌన్, వెలుగు : 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రవీందర్రావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు.