‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతివ్వండి

‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతివ్వండి

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతి కోరుతూ ఆ పార్టీ నాయకులు డీజీపీని కలిశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ గతంలో ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ను నిర్వహించారు. తాజాగా ఆయన ఈ నెల 14 నుంచి రెండో విడత యాత్రను జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు డీజీపీ లేఖ అందించారు.  టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలను తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారని.. ఈ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. యాత్రలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసే అవకాశమందని డీజీపీ తెలియజేశారు. ప్రజా సమస్యల కోసమే ఈ యాత్రను చేస్తున్నామని.. శాంతియుతంగా యాత్ర కొనసాగేలా చూడాలని నేతలు డీజీపీని కోరారు.

For More News..

ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు