నిరుద్యోగులతో ఊరికో ఉద్యమం : రేవంత్ రెడ్డి

నిరుద్యోగులతో ఊరికో ఉద్యమం : రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 21న నల్గొండ ఎంజీ వర్సిటీలో కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టనున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు, 24న ఖమ్మం, 26న  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, మే 4,5లో ఏదో ఒక రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలోని శ్రీకాంత్ చారి విగ్రహానికి శ్రీమతి ప్రియాంక గాంధీ నివాళులర్పి్స్తారని, ఆ తర్వాత సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ అన్ని కార్యక్రమాలకు 50లక్షల విద్యార్థులు ఓ సామాజిక బాధ్యతగా పాల్గొనాలని కోరారు. అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఈ నిరసన దీక్షలో భాగస్వామ్యం కావాలని చెప్పారు. మీ వంతు సహకారాన్ని అందించాలని రేవంత్ రెడ్డి అన్నారు.

బీజేపీ నేతలు ఢిల్లీలోని ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న ఆయన.. ఏటా కోటి ఉద్యాగాలిస్తమన్న ప్రధాని సైతం మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అబద్దాలు చెప్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని చెప్పారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పాపం ముమ్మాటికీ సర్కారు దేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకే సిట్ వేశారన్న ఆయన.. పేపర్ లీక్ లో అసలు నిందితులు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.