రైతుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే..వేలురుకు బీజేపీ నేతలు

రైతుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే..వేలురుకు బీజేపీ నేతలు

సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్  లో ఎస్సీ వర్గానికి చెందిన  బ్యాగరి నరసింహులు పురుగుల మందు తాగి మరణించడం పట్ల బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేసింది. .ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.  వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి,మాజీ మంత్రులు  మోత్కుపల్లి నరసింహులు, బాబుమోహన్,  MLC ఎన్. రామ చందర్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్  లతో నిజ నిర్ధారణ కమిటీని వేశారు బండి సంజయ్. ఈ కమిటీ ఇవాళ(30న) మధ్యాహ్నం మూడు గంటలకు బ్యాగరి నరసింహులు కుటుంబ సభ్యులను పరామర్శిస్తుందన్నారు.  టిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు బండి సంజయ్. పరోక్షంగా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. దళితుల భూములను లాక్కోవడం అక్రమాలకు పాల్పడటం టిఆర్ఎస్ పార్టీ నేతలకు అలవాటేనన్నారు.