- హాజరుకానున్న బండి సంజయ్, కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో జరుగనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సభకు కనీసం రెండు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నది.
సభా ఏర్పాట్లు, జన సమీకరణపై వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో చర్చించేందుకు ఆదివారం వరంగల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీలోని కీలక నేతలందరికీ ఆహ్వానాలు అందాయి.