కేటీఆర్.. ఏ ముఖంతో ఓట్లడిగేందుకు వస్తున్నవ్..బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్

కేటీఆర్.. ఏ ముఖంతో ఓట్లడిగేందుకు వస్తున్నవ్..బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  పదేండ్ల పాటు మున్సిపల్  శాఖ మంత్రిగా పనిచేసినా జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్  అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్  అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని.. ఏ ముఖంతో ఓట్లడిగేందుకు ఆయన వస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. 

శనివారం హైదరాబాద్  శ్రీనగర్  కాలనీ ఇందిరానగర్ లో పాయల్ శంకర్  మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్  పాలనలో మోసాలు, రెండేండ్ల కాంగ్రెస్  పాలనలో దోపిడీలు జరిగాయన్నారు. ప్రజలు ఈ రెండు పార్టీలను ఓడించి, బీజేపీకి ఓటు వేయాలని కోరారు. జూబ్లీహిల్స్  బైపోల్ లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలన్నారు.