- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై మాత్రమే స్పందిస్తారా
- మీరు పని చేస్తున్న రాష్ట్రంలోని ఘటనల పైనా ట్వీట్ చేయండి:
- స్మితా సబర్వాల్ కు దుబ్బాకా ఎమ్మెల్యే రఘునందన్ సూచన
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ఇచ్చారు. ఇటీవల ఆమె వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న పోస్టులు చర్చానీయంశం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఇటీవల జరిగిన మణిపూర్ ఘటనపై స్పందించిన ఆమెకు తాజాగా రఘునందన్రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశారు. దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే సంఘటనపై సత్వరమే స్పందించి ట్వీట్లు పెట్టే మీరు బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై కూడా సత్వరమే స్పందించాలని కోరుకుంటున్నాం అని ఆయన ట్వీట్ చేశారు. దీనపై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఎందుకని సెలెక్టివ్గా ఆలోచిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలపై స్మితా సబర్వాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
