ఇంటికో ఉద్యోగం ఎటుపోయింది..?: రఘునందన్​రావు

ఇంటికో ఉద్యోగం ఎటుపోయింది..?: రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నా కేసీఆర్​ ప్రభుత్వాని అందరూ నిలదీయాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు పిలుపునిచ్చారు. సోమవారం అక్భర్​పేట-భూంపల్లి మండలంలోని తాళ్లపల్లి, నగరం గ్రామాల్లో  బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో కొట్లాడి అక్భర్​పేట-భూంపల్లి మండలం వచ్చేలా చేశానన్నారు.

తానొచ్చిన తర్వాతనే మెదక్​నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు రూ.16 వందల కోట్ల నిధులతో జాతీయ రహదారిని తీసుకొచ్చానన్నారు. గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్నికలు ముగియగానే తాళ్లపల్లి, కల్వకుంట్ల గ్రామాల మధ్య రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. మరొక్కసారి తనను అసెంబ్లీకి పంపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.  కార్యక్రమంలో తాళ్లపల్లి సర్పంచ్​ ప్రియాంక, బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు.