తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు

మెదక్ : కేంద్రం లక్షల కోట్లు ఇస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం నిధులు ఇవ్వడంలేదని అబద్దాలాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మెదక్ పట్టణంలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై యుద్ధం చేస్తానని తిరుగుతున్న ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడతారని రాజాసింగ్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై టీఆర్ఎస్ శ్రేణులు అబద్దాలాడుతున్నాయని, బీజేపీ క్యాడర్ ఇంటింటికీ వెళ్లి వాటి గురించి వివరించాలని చెప్పారు. మోడీ గురించి టీఆర్ఎస్ నాయకులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం..

సొంతగడ్డపై గుజరాత్ గెలిచేనా..?

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల