
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందూ ద్రోహని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువులపై దాడులు హత్యలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో జై శ్రీరామ్ అంటే చంపేస్తారా?..ఢిల్లీలో హిందువులు సేఫ్ గా ఉన్నారా? అని అన్నారు. రింకు శర్మ అనే వ్యక్తి రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ చేస్తున్నాడని.. అందుకే స్థానిక ముస్లింలు రింక్ శర్మ ను టార్గెట్ చేశారన్నారు. ఆయన ఇంటికి పైన 50 మంది వరకు దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశారన్నారు. గతంలో కూడా ఢిల్లీలో హిందువుల పైదాడుల చేసి చంపేశారన్నారు. రింకూ శర్మను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చూడాలన్నారు. లేదంటే తమ చేతికి దొరికితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. కేజ్రీవాల్ కు హిందువులు ఓట్లు వేయలేదా? ముస్లిం ఓట్లతోనే గెలిచారా ?అని అన్నారు. కేజ్రీవాల్ హిందువులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని.. ఢిల్లీ నుంచి ఆయనను బయటకు పంపాలన్నారు. ప్రతి ఒక్క హిందువు కేజ్రీవాల్ కు వ్యతరేకంగా పని చేయాలని ఢిల్లీలో ఉంటున్న హిందువులకు సలహా ఇచ్చారు.
see more news