ఓటమి నిరాశతో కేసీఆర్ నీచానికి దిగజారిండు

ఓటమి నిరాశతో కేసీఆర్ నీచానికి దిగజారిండు
  • ఎంపీ ధర్మపురి అరవింద్

హైదరాబాద్: ఎలక్షన్లలో ఓడిపోయానని, ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నానని తీవ్ర నిరాశతో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ చట్టం గురించి సీఎం స్థాయి మర్చిపోయి, అబద్దాలు ఆడే నీచమైన స్థాయికి దిగజారిండు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తీన్మార్ మల్లన్న లొట్టపీసు మాట అన్న కేసులో అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నడని ఆరోపించారు. ఒక జర్నలిస్టును వేధించడానికి అధికార యంత్రాంగాన్నంటినీ తీసుకొని దిగినందుకు కేసీఆర్ సిగ్గుపడాల అని ఆయన అన్నారు. తీన్మార్ మల్లన్న భార్య ఒక దళితురాలు, ఆ దళితురాలికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారి అండ ఉండాలని, ఆమెని తీసుకుపోయి షా గారితో భేటీ చేయించిన, అది దళితుల పట్ల నాకున్న చిత్తశుద్ధి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.