సీఎం కేసీఆర్కు ఎంపీ లక్ష్మణ్ సవాల్ 

సీఎం కేసీఆర్కు ఎంపీ లక్ష్మణ్ సవాల్ 

మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని  బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ కి దమ్ముంటే  మునుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. రాజేంద్ర సర్కిల్  మహవీర్ కాలేజీలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా 3 రోజుల  శిక్షణా శిబిరం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ లక్ష్మణ్,మాజీ ఎంపీ మురళీధర్ రావులు పాల్గొన్నారు.ఉద్యమకారాలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభించలేదని లక్ష్మణ్ ఆరోపించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు సమచిత స్థానం ఇచ్చి వారికి ఉన్నత పదవులతోపాటు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ అప్పుల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పాలనపై ప్రజల అసంతృప్తితో ఉన్నారని,రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఓబీసీ మోర్చా నేతలందరూ కలిసి ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.