తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. జగన్ తప్పు చేసి ఉంటే జైలుకెళ్లక తప్పదన్నారు.వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్న ఆయన ..వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైంది కాదన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకన్న వైఎస్సార్సీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు
జగన్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటుండని..ఏడుకొండలవాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదని సునీల్ దియోధర్ హెచ్చరించారు. జగన్ నాశనమైపోతారని... ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీ ఉండదని వ్యాఖ్యానించారు. జగన్ ఏపీకి సీఎం కావడం అక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని అన్నారు.
టీటీడీలో అన్యమతస్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని దియోధర్ తెలిపారు. గత కొన్ని రోజుల ముందు టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు దియోధర్.