మోదీ హ్యాట్రిక్ ఖాయం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డ్‌ బ్రేక్‌ చేస్తం: బీజేపీ ఓబీసీ మోర్చా

మోదీ హ్యాట్రిక్ ఖాయం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డ్‌ బ్రేక్‌ చేస్తం: బీజేపీ ఓబీసీ మోర్చా

హైదరాబాద్‌, వెలుగు : 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్‌ సోషల్‌ మీడియా మెంబర్‌ పెరిక సురేశ్​ అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షను జాతీయ స్థాయిలో ప్రతిబింభించాయని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ప్రజలు మోదీ అభివృద్ధికి  జైకొట్టారని పేర్కొన్నారు.

ఇండియా కూటమి విభజన రాయకీయాలను రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌  ప్రజలు తిరస్కరించి.. నరేంద్ర మోదీ అభివృద్ధి రాజకీయాలకు పట్టం కట్టారని తెలిపారు. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు పెద్ద మెజారిటీ ఇవ్వలేదని,  బీజేపీకే 14 శాతం ఓటింగ్ పెరిగిందని  చెప్పారు. ‘‘గత ఎన్నికలతో పోలిస్తే ఓటు బ్యాంక్‌ పెంచుకుని 8 స్థానాల్లో గెలిచిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు రికార్డును బ్రేక్‌ చేస్తుందని  సురేశ్​ వెల్లడించారు.