కాంగ్రెస్, టీఆర్‌‌ఎస్‌‌లు రెండూ ఒక గూటి పక్షులే

కాంగ్రెస్, టీఆర్‌‌ఎస్‌‌లు రెండూ ఒక గూటి పక్షులే

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్‌‌ ఎంపీ రాహుల్‌‌ గాంధీ సభలు వృధా ప్రయాస అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌‌ఎస్‌‌లు రెండూ ఒక గూటి పక్షులేనని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఎన్నికల ముందో, ఎన్నికల తర్వాతో తప్పకుండా కలుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని, దేశంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. అధికారం ఉన్నచోట పట్టు కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజలను మభ్యపెడుతూ రాజకీయం చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామని చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌‌ను ఎవరూ నమ్మరని విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ కాన్‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌లో పాలసీ, రీసెర్చ్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. దీనికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ పాల్గొన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. డబుల్‌‌ ఇంజన్‌‌ సర్కార్‌‌తోనే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతదన్నారు.