బీజెపీ పార్టీ ధనికుల కోసం, బీఆర్ఎస్ పార్టీ కమీషన్ ల కోసం పని చేస్తుంది : వివేక్ వెంకటస్వామి.

బీజెపీ పార్టీ ధనికుల కోసం, బీఆర్ఎస్ పార్టీ కమీషన్ ల కోసం పని చేస్తుంది : వివేక్ వెంకటస్వామి.

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణా రాష్ట్ర ఖజానా ఖాలీ చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయల నిధులు వృధా చేశారని ఆరోపించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు రూ. 2500 అకౌంట్ లలో  వేస్తామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు రూ. 6 వేలు ఇస్తానని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని చెప్పారు. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పని చేసిందని అందరి అకౌంట్ లలో రూ. 15 లక్షల రూపాయలు వేస్తానని మోసం చేశారని ఫైర్ అయ్యారు.

బీజెపీ పార్టీ ధనికుల కోసం, బీఆర్ఎస్ పార్టీ కమీషన్ ల కోసం పని చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2000 బోర్లు వేయించి నీటి ఎద్దడి లేకుండా చేశానని తెలిపారు. ఆగస్టు 15 వరకు అందరికీ రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని అన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.