కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనను గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. పలు న్యూస్ చానెళ్లలో బీజేపీ తరఫున చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై సంబిత్ పాత్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఈ రోజు కూడా పలు ట్వీట్లు చేశారు. కరోనా టెస్టులు చేయించుకునేందుకే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది.