ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో

 ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోట అయిన ఇటావాలో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు.  ఇటావా తర్వాత మోదీ మధ్యాహ్నం సీతాపూర్‌లో జరిగే ర్యాలీలో కూడా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి రామమందిరంలో ప్రార్థనలు చేసి రోడ్‌షో నిర్వహిస్తారు.  సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు నరేంద్ర మోదీ రోడ్ షో చేయనున్నారు. 

ఈ సందర్భంగా 75 చోట్ల ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 100 క్వింటాళ్ల పూలను సమకూర్చారు.   మోదీ రాక సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆ తర్వాత మోదీ అయోధ్యకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.