ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోట అయిన ఇటావాలో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు. ఇటావా తర్వాత మోదీ మధ్యాహ్నం సీతాపూర్లో జరిగే ర్యాలీలో కూడా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి రామమందిరంలో ప్రార్థనలు చేసి రోడ్షో నిర్వహిస్తారు. సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు నరేంద్ర మోదీ రోడ్ షో చేయనున్నారు.
ఈ సందర్భంగా 75 చోట్ల ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 100 క్వింటాళ్ల పూలను సమకూర్చారు. మోదీ రాక సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆ తర్వాత మోదీ అయోధ్యకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.