కాసేపట్లో హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ

కాసేపట్లో హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ

బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర చివరి రోజు బీజేపీ వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి వరంగల్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.  సునీల్ బన్సల్ ను విజయశాంతి కూడా కలిశారు. 

కాసేపట్లో హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో బీజేపీ సభ ప్రారంభం కానుంది. బండి సంజయ్ చేపట్టిన మూడోవిడత ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజు హన్మకొండలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. 3వ విడతలో 5 జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు. మూడోవిడతలో 300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేశారు. 3 విడతల్లో మొత్తం 1121 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 18 జిల్లాల్లోని 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.