నేడు బీజేపీ  రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్

నేడు బీజేపీ  రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్ ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరగనుంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి తరుణ్ చుగ్ ముఖ్య​అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఇటీవల ఏర్పాటు చేసిన చేరికల కమిటీ, ఫైనాన్స్ కమిటీ, టీఆర్ఎస్ వైఫల్యాల కమిటీలతో భేటీ అవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై కోర్ కమిటీలో చర్చించనున్నారు. తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కమిటీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.