దళితుణ్ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే

దళితుణ్ని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే

హైదరాబాద్: దళితుల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ చేపట్టిన  ప్రజా సంగ్రామ యాత్ర కూకట్ పల్లిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నేతలు సంజయ్ ను కలిసి కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలతో బండి సంజయ్ మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

దళితుల కోసం బీజేపీ ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. దళితుణ్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చింది కూడా బీజేపీనే అని గుర్తు చేశారు. ఎవరో చెప్పే మాటలు నమ్మి దళిత సంఘాల నేతలు బీజేపీని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.