కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై బండి సంజయ్ రివ్యూ

కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై బండి సంజయ్ రివ్యూ

కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమీక్షించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇప్పటికే ఫండ్స్ మంజూరు చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ పనులు మందకొడిగా కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా 2017 జూన్ 23న కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అభివృద్ధి పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.