12న బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

12న బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. బీసీలంటే కేసీఆర్​కు చిన్నచూపని విమర్శించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు కేవలం మూడు రోజుల సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఇది బడుగు, బలహీన వర్గాలను మోసం చేయడం కాదా అని నిలదీశారు. కేసీఆర్  ఎన్నికల కోసమే జిమ్మిక్కులు చేస్తున్నారని, మొదట్నించీ బీసీలపై సర్కారు వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఎన్నికలొస్తున్నాయనే కుల వృత్తులవారికి ఆర్థిక సాయం అంటూ కబుర్లు చెబుతున్నారన్నారు. హైదరాబాద్​లో నడిరోడ్డుపై ఓ యువతిని వివస్త్రను చేస్తే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఫైరయ్యారు.