బీజేపీ ఇంచార్జ్ కి కరోనా.. సెల్ఫ్ క్వారంటైన్‌‌లోకి బండి సంజయ్

బీజేపీ ఇంచార్జ్ కి కరోనా.. సెల్ఫ్ క్వారంటైన్‌‌లోకి బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కృష్ణదాస్ కి కరోనా సోకింది. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పార్టీ సంస్థాగత విషయాలను చర్చించేందుకు బండి సంజయ్ ఈ నెల 14వ తేదీన కృష్ణదాస్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత కృష్ణదాస్ కు కరోనా సోకినట్టుగా తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ . ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజుల పాటు స్వీయ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగ‌ళ‌వారం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. దీంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని బండి సంజయ్ గౌరవ పార్లమెంట్ స్పీకర్ గారికి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి సమాచారం అందించారు.