ఉన్నావ్‌ నిందితులతో బీజేపీకి సంబంధాలు: అఖిలేశ్‌ యాదవ్‌

ఉన్నావ్‌ నిందితులతో బీజేపీకి సంబంధాలు: అఖిలేశ్‌ యాదవ్‌

ఉన్నావ్‌ నిందితులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌. ఉన్నావ్‌ ఘటనను నిరసిస్తూ ఉత్తర ప్రదేశ్  అసెంబ్లీ బయట అఖిలేశ్‌ యాదవ్‌ ధర్నాకు దిగారు. ఇవాళ చీకటి రోజని అన్నారు. యోగి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఉన్నావ్‌ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలను అరికట్టడంలో యోగి సర్కారు విఫలమైందన్నారు.