హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్ని కల్లో గెలిచి, బీజేపీని ఇంటికి పంపిస్తా మని కాం గ్రెస్ నేత, మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఫామ్హౌజ్ కు పంపించా మని, బీజేపీకి కూడా అదేగ తి పట్టిస్తా మని తెలిపారు. శనివారం ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడా రు. బీజేపీ నాయకులు ప్రచారానికి వస్తే నిలదీయాలని ప్రజలను కోరారు.
బీజేపీ ఎస్సీ సెల్కి, కాంగ్రెస్ ఎస్సీ సెల్కి చాలా తేడా ఉందన్నారు. బీజేపీ ఎస్సీ సెల్ నాయకులు చనిపోతే కూడా ఆ పార్టీ నాయకు లు కనీసం పరామర్శించరని ఆరోపించా రు. మందకృష్ణ మాదిగ అవకాశవాద రాజకీయాలు మానుకోవా లని సూచిం చారు. మాదిగలకు మంద కృష్ణ ఏం చేశా రో చెప్పాలని డిమాండ్ చేశారు. మాది గలకు సోషల్ స్టేటస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సే అని పుష్పలీల పేర్కొన్నారు.