రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ యుద్ధంలో అందరం రాహుల్ గాంధీ పక్కన నిలవాలని సూచించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

మతాన్ని రెచ్చగొట్టే విధంగా బీజేపీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థుల మాటలు కూడా అలానే ఉన్నాయని అన్నారు. మత పిచ్చి లేపి లబ్ధిపొందాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల అధికారలు వారిని అరెస్టు చేయాలని కోరారు. బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. హైదరాబాద్ లో మతసారస్యాన్ని కాంగ్రెస్ కాపాడిందన్నారు. 

హైదరాబాద్ విశ్వనగరం కావడానికి కాంగ్రెస్ కారణమని తెలిపారు. నరేంద్ర మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.