కార్పొరేట్ దిగ్గజాల కోసమే బీజేపీ పని చేస్తున్నది: ప్రొఫెసర్ కంచె ఐలయ్య

కార్పొరేట్ దిగ్గజాల కోసమే బీజేపీ పని చేస్తున్నది: ప్రొఫెసర్ కంచె ఐలయ్య

ముషీరాబాద్,వెలుగు: దేశంలో బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే బీజేపీ పని చేస్తుందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. ఆ కంపెనీలు ఆదేశించడంతోనే  బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు పూనుకుంటుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.

శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్ జన జాతర రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అదానీ, అంబానీలకు అండగా మోదీ నిలుస్తున్నారని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్ వెస్లీ, టీ స్కైలాబ్ బాబు, ఉడుత రవీందర్  పాల్గొన్నారు.