రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది : మైనంపల్లి హనుమంతరావు

రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది :  మైనంపల్లి హనుమంతరావు

బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు. రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతోందిని అన్నారు. దేవుడితో రాజకీయాలు చేసినవారందరూ కుప్ప కూలిపోవడం ఖాయమని చెప్పారు. మల్కాజ్ గిరిలో మైనంపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలను, మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

 అన్ని మతాలను సమానంగా చూసే సిద్ధాంతం తమదని మైనంపల్లి తెలిపారు. మన దేశం, రాష్ట్రం బాగుండాలంటే అన్ని మతాల వారు బాగుండాలని చెప్పారు. హిందూ హిందూ అంటూ మత రాజకీయం కరెక్ట్ కాదన్నారు. డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని సునితా మహేందర్ రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిస్టంలో మార్పు రావాలని.. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు.