90 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి రికార్డు సృష్టించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

90 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి రికార్డు సృష్టించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

బీజేపీ ఎంపీ తేజశ్వీ సూర్య ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజ్ ను పూర్తి చేసి రికార్డు సాధించారు. గోవాలో ఐరెన్ మ్యాన్ 70.3 రేస్  రేస్ ను నిర్వహించారు. అందులో భాగంగా స్విమ్మింగ్, సైక్లింగ్ , రన్నింగ్ పోటీలు నిర్వహించారు.  33 దేశాల నుంచి 1500 మంది యువతీ యువకులు పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజ్ లో పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ... 90 కిలోమీటర్ల సైక్లింగ్ చేసి రికార్డు సృష్టించారు.

దీంతో ఐరన్ మ్యాన్ రిలే ఛాలెంజ్ ను పూర్తి చేసిన మొదటి ఎంపీగా తేజస్వీ సూర్య రికార్డు సాధించారు. ప్రధాని మోడీ ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైక్లింగ్ చేసినట్లు తేజశ్వీ సూర్య తెలిపారు. మోడీ నేతృత్వంలో ప్రభుత్వ క్రీడలు, ఫిట్ నెస్ పై ప్రగతి సాధిస్తున్నామన్నారు.