తుగ్లక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలి

తుగ్లక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలి

కుటుంబ పాలన చేస్తున్న తుగ్లక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలని బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మంథని అంబేద్కర్ చౌరాస్తాలో వరద బాధితుల కోసం బీజేపీ పార్టీ అధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. వరదల వల్ల నష్టపోయిన సామాన్య ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తప్పుడు రీ డిజైనింగ్ ప్రాజెక్టుల వల్లనే వరదలు వస్తున్నాయని చెప్పారు. ప్రాజెక్టుల వల్ల వరదలు వచ్చి నష్టపోయిన మంథని ప్రాంత వరద బాధితులకు కేసీఆర్ ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే కేసీఆర్ పాలసీ అని మండిపడ్డారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, తదితర పార్టీ శ్రేణులు, వరద బాధితులు పాల్గొన్నారు.