టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించొద్దు

టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించొద్దు
  • బీజేవైఎం సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్

ముషీరాబాద్, వెలుగు:  నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను ఎలాంటి విచారణ జరపకుండా ఆమోదించవద్దని  బీజేవైఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమగ్ర విచారణ చేసిన తర్వాతనే ఈ వివాదంలో బాధ్యులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నో ఆశలతో, నమ్మకంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని.. వెంటనే జాబ్ క్యాలెండర్  రిలీజ్ చేయాలన్నారు. రాజకీయ నిరుద్యోగులు ఎవరినీ టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించవద్దన్నారు. పూర్తి అవగాహన ఉన్న మేధావులను సభ్యులుగా నియమించాలంటూ బుధవారం ఓ ప్రకటనలో ప్రవీణ్​ కోరారు.