తాడ్వాయి, వెలుగు : చలి తీవ్రంగా ఉండడంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంతో పాటు రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లోని పేదలకు హైదరాబాద్ శ్రియ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ శ్రియ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు పేదలకు దుప్పట్లు పంపించినందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షుడు బొల్లు దేవేందర్, సహకార సంఘం మాజీ చైర్మన్ సంపత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, మేడారం యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
