అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 5 హామీలను అమలు చేశామన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, లోక్ సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ కోసం పోరాడనని.. ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తుచేశారు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వంశీ కృష్ణను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కేసీఆర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు .. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బుద్ది చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. పదేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని వివేక్ ఆరోపించారు.