ఖమ్మం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో రక్తదానం

ఖమ్మం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో రక్తదానం

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : ఖమ్మం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో ఐఎఫ్ఎస్ సిద్ధార్థ విక్రం సింగ్ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ లాస్ అండ్ ఎన్ఫోర్స్​మెంట్​’ కార్యక్రమంలో భాగంగా శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో వారిన అభినందించి మాట్లాడారు.

 మనిషి సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి రక్తం అన్నారు. దానివల్ల ప్రాణాలనే నిలబెట్టవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చందునాయక్, డాక్టర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.