క్విటో: ఈక్వెడార్లోని గ్వాయాక్విల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుతో శనివారం గొడవ జరిగిందని అధికారులు చెబుతున్నారు.హాల్ నెంబర్12లో ఉన్న వారిని చంపడానికి హాల్ నెంబర్ 7 ఖైదీలు దాడి చేశారని తెలిపారు.
‘‘పెవిలియన్ 2లోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న గోడను డైనమైట్తో పేల్చడానికి ప్రయత్నించారు. ఊపిరాడక ప్రత్యర్థి ఖైదీలు చనిపోవాలని పరుపులను తగులబెట్టారు” అని అధికారులు చెప్పారు. కాగా కొద్ది రోజుల క్రితం ఈక్వెడార్ లోని వేరే జైలులో జరిగిన ఘర్షణలో సుమారు 119 మంది మరణించారు.