
ఇండియా పేరును..భారత్ గా మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో..ఈ పేరును క్యాష్ చేసుకునే పనిలో పడింది ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్. బ్లూ డార్ట్ పేరును భారత్ ప్లస్ గా మార్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇకపై బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీసులు భారత్ డార్ట్ పేరుతో కొనసాగుతాయని వెల్లడించింది. బ్లూ డార్ట్ ప్రయాణంలో పేరు మార్పు ఓ మైలురాయి అని అభిప్రాయపడింది.
ఎందుకు మార్చామంటే..
బ్లూ డార్ట్ పేరును భారత్ డార్ట్గా ఎందుకు మార్చామో ఆ సంస్థ తెలిపింది. భారత్ లోని తమ వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పేరు మార్పుపై ఎంతో పరిశోధన చేశామని చెప్పింది. బ్లూ డార్ట్ కంపెనీ భారత్ను ప్రపంచంతో కలిపేందుకు..అలాగే ప్రపంచాన్ని భారత్తో కలిపేందుకు పేరు మార్పు ఒక భాగం కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read : మోదీ వినాయకచవితి శుభవార్త : 75 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్స్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్
దేశ పేరు కూడా మారుతుందా..?
మరోవైపు ఇండియా పేరును కూడా భారత్ గా మారుస్తారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. వీటికి బలం చేకూరుస్తూ..సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సదస్సు విందు ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది. అదే విధంగా జీ20 సదస్సులోనూ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ ముందు టేబుల్పై దేశం నేమ్ ప్లేట్పై ఇండియాకు బదులు భారత్ అని కనిపించింది