బ్లూ లైట్​ చాలా డేంజర్

బ్లూ లైట్​ చాలా డేంజర్

గంటల కొద్దీ  కంప్యూటర్ మీద పనిచేయడం, ఫోన్​లో సోషల్​ మీడియా పోస్ట్​లు చూస్తూ గడపడం, షోలు, వీడియోలు చూడడం... లైఫ్​స్టయిల్లో భాగం అయింది.  కరోనా కాలం​ కూడా డిజిటల్​ స్క్రీన్ టైమింగ్​ని పెంచేసింది. దాంతో చాలామందిలో బ్లూ లైట్​ ఎఫెక్ట్ కనిపిస్తోంది. 20 నిమిషాలు మండే ఎండలో ఉంటే చర్మం ఎంత డ్యామేజ్​ అవుతుందో, 48 గంటలు డిజిటల్​ స్క్రీన్​ చూసినా అంతే డ్యామేజ్​ అవుతుందట.  

ఇలా చేస్తే బెటర్​

ఎలక్ట్రానిక్ డివైజ్​లకి స్క్రీన్​గార్డ్ పెట్టుకోవాలి. కొత్తగా వస్తున్న కొన్ని రకాల ఎలక్ట్రానిక్​ డివైజ్​ల్లో బ్లూ లైట్​ని డిజేబుల్​ చేసే ఆప్షన్​ ఉంటుంది. అలాంటి డివైజ్​లు​ ఉపయోగిస్తే కళ్లు, చర్మం దెబ్బతినవు.  ఎండలో బయటికి వెళ్లేటప్పుడు మామూలు సన్​స్క్రీన్​ బదులు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న  సన్​స్క్రీన్​ రాసుకోవాలి. ఇవి  బ్లూ లైట్​ వల్ల  స్కిన్ డ్యామేజ్​ కాకుండా చూడడమే కాకుండా చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి. అందుకే మార్నింగ్ రొటీన్​లో భాగంగా సన్​స్క్రీన్​ రాసుకుంటే మరీ మంచిది.  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలు, ఆరెంజ్​, కివి వంటి పండ్లు తినాలి. బీన్స్, బ్రకోలి, క్యారెట్లు, బీట్​రూట్​, పాలకూర వంటివి తిన్నా కూడా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.