- బీఎన్ రెడ్డి శివారు కాలనీవాసుల ఆందోళన
- బైఠాయించి ధర్నా చేసిన 200 కుటుంబాలు
ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివారు కాలనీలో డ్రైనేజ్ ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ శివారు ప్రాంత కాలనీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆదివారం 20 కాలనీలకు చెందిన స్థానికులు బ్యాంకు కాలనీలో సమావేశమయ్యారు. కొన్నేళ్లుగా డ్రైనేజీ ట్రంక్ లైన్ లేకపోవడంతో రోడ్లు లేని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చి బడ్జెట్ తీసుకొచ్చిన తర్వాతనే పొలిటికల్ లీడర్లను కాలనీల్లోకి అనుమతించాలని తీర్మానించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
నెల రోజుల్లోపు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే లీడర్లను కాలనీల్లోకి అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. ఈ ధర్నాలో సుమారు200 మంది కాలనీవాసులు తమ ఫ్యామిలీతో పాల్గొన్నారు. ఐక్య వేదిక కాలనీ వాసులు రవి కుమార్, భవాని, చిత్త రంజన్ వెంకటేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.