రాహుల్ గాంధీ పై జరిగిన దాడికి నిరసనగా బోడుప్పల్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ

రాహుల్ గాంధీ పై జరిగిన దాడికి నిరసనగా బోడుప్పల్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ

హైదరాబాద్: హత్రాస్ ఘటనతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పోలీసుల ప్రవర్తనను ఖండిస్తూ హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రాహుల్ గాంధీ పై జరిగిన దాడికి నిరసనగా బోడుప్పల్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం బోడుప్పల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్.. మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ బోడుప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు నినాదాలు చేశారు.