
మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కార్పొరేషన్ కాంగ్రెస్కైవసం చేసుకున్నట్లయింది. మొత్తం 28 కార్పొరేటర్లు ఉండగా, శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి 22 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కీసర ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది.