
ముంబై: సెక్స్ రాకెట్ నడుపుతున్నాడన్న ఆరోపణలపై ఓ బాలీవుడు ప్రొడక్షన్ మేనేజర్ను అరెస్టు చేసినట్లు శనివారం ముంబై పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉజ్బెకిస్థాన్ మహిళలను ఈ సెక్స్ రాకెట్ నుంచి కాపాడినట్లు చెప్పారు. పక్కా సమాచారంతో ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఫోర్ స్టార్ హోటల్ జెద్ లగ్జరీ రెసిడెన్సీలో నిన్న పోలసులు రైడ్ చేశారు. అక్కడ అక్రమంగా ప్రాస్టిట్యూషన్ నడుపుతున్న బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్ కుమార్ లాల్ను అరెస్టు చేశారు. ఇద్దరు ఉజ్బెకిస్థాన్ మహిళలను వారి చెర నుంచి విడిపించారు.
గత నెల 23న కూడా అదే హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్న వాళ్ల నుంచి ముగ్గురు మహిళలను పోలీసులు కాపాడామని పోలీసులు చెప్పారు. అక్కడ రాజేశ్ కుమార్ లాల్ సాయంతో ఉజ్బెకిస్థాన్ మహిళ జరీనా ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ నడుపుతోందన్నారు. విదేశీ మహిళలను పెట్టి స్టార్ హోటల్కు కస్టమర్లను పిలిపించి ఒక్కొక్కరి దగ్గర రూ.80 వేలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఉజ్బెకిస్థాన్లోనే ఉండి జరీనా ఈ రాకెట్ నడిపిస్తున్నారన్నారు. రాజేశ్ కుమార్ లాల్పై హ్యూమన్ ట్రాఫికింగ్ సహా పలు కేసులు పెట్టినట్లు చెప్పారు.