బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్(Kangana Ranaut).. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది. సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.
వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా బిజీయే! కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో ఈమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది.
తమిళం లోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళం లో నటించిన చంద్రముఖి-2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది. ఈ సినిమా పై కంగనా ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె పాత్ర ఎక్కువగా లేదంటూ ఫీలవుతున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్ తో పాటు విజయ్సేతుపతి(Vijay Sethupathi) సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు.
విజయ్సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి..