ఢిల్లీలోని ఇజ్రాయల్ ఎంబసీ దగ్గర భారీ బాంబు పేలుడు

ఢిల్లీలోని ఇజ్రాయల్ ఎంబసీ దగ్గర భారీ బాంబు పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ఇజ్రాయల్ ఎంబసీ బిల్డింగ్ వేవ్ మెంట్ పై సాయంత్రం బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. బాంబు పేలుడు కారణంగా ముందస్తు జాగ్రత్తగా అబ్దుల్ కలాం రోడ్డును బ్లాక్ చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు.పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగును పేవ్ మెంట్ పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.

రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో భాగంగా విజయ్ చౌక్ దగ్గర సైనిక ,పారా మిలటరీ దళాలు బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అయితే పేలుడు జరిగిన ప్రాంతం కేవలం విజయ్ చౌక్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.