లడఖ్ లో మరోసారి రూల్స్ ఉల్లంఘించిన చైనా

లడఖ్ లో మరోసారి రూల్స్ ఉల్లంఘించిన చైనా

సరిహద్దులో చైనా రెచ్చిపోతూనే ఉంది.  చర్చలు జరిపి.. శాంతిస్థాపనకు అంగీకారం జరిగిన తర్వాత కూడా పరిస్థితి చక్కబడటం లేదు. ఈస్టర్న్ లడఖ్ లో చైనా మరోసారి రూల్స్ ఉల్లంఘించినట్టు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు విదేశాంగశాఖ అధికారులు. గతంతో పాటు.. ఇటీవల చాలా సార్లు సమావేశమై శాంతిస్థాపనకు చర్చలు జరిపారు రెండు దేశాల అధికారులు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర బలగాలు ఉండొద్దని చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ చైనా మాత్రం ఒప్పందాలను పాటించడం లేదు. సరిహద్దులో భారీగా బలగాలను మోహరించిందని అధికారులు చెబుతున్నారు.