
పెద్దపల్లి, వెలుగు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి రెండు బోర్వెల్స్, సీసీ రోడ్డు మంజూరయినట్లు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బాలసాని సతీశ్గౌడ్ అన్నారు. గురువారం బోజన్నపేట గ్రామంలోని మల్లన్న గుడి, పోచమ్మగుడిలో రెండు బోర్వెల్స్ వేయించారు.
ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ గ్రామంలోని మల్లన్న, పోచమ్మ గుళ్లలో నీటి అవసరంపై ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఒక్కో దానికి రూ.2 లక్షలు మంజూరు చేశారన్నారు. 9 వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ. 5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.