
మాదాపూర్, వెలుగు: పబ్లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్చల్ చేసింది. బిల్లులో డిస్కౌంట్ ఇవ్వాలని పబ్ నిర్వాహకులతో గొడవ పడి అడ్డు వచ్చిన బౌన్సర్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో నలుగురు బౌన్సర్లకు గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 20న నగరానికి చెందిన శివ, జితేశ్, ప్రశాంత్, సదానంద్పాటు సుమారు 20 మంది యువకులు కొండాపూర్ వైట్ఫీల్డ్ రోడ్డులో ఉన్న మ్యాడ్ క్లబ్ పబ్కు వెళ్లారు. అందరూ కలిసి ఫుల్గా మద్యం తాగారు. బిల్లు రూ.18 వేలు కాగా డిస్కౌంట్ ఇవ్వాలని పబ్ మేనేజర్తో గొడవ పడ్డారు.
అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బౌన్సర్లు అఫ్రోజ్, ప్రశాంత్, మాజీద్, రషీద్, చరణ్ గాయపడ్డారు. పబ్ ఓనర్ ప్రశాంత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు.