పాము కాటుతో బాలుడు మృతి

పాము కాటుతో బాలుడు మృతి

అయిజ, వెలుగు: గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఎలుక రాజు కొడుకు అజయ్ (15) అతడి అక్కను కలిసేందుకు దగ్గరలో ఉన్న కుట్కనూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి కావడంతో అక్కడే ఉండిపోయాడు. అక్క, బావ కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్ర పోయాడు. పొద్దున లేచేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు.

బాలుడి కాలిపై పాముకాట్లు ఉన్నట్లు గుర్తించి వెంటనే కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.