ఇండస్ట్రియలిస్ట్‌‌లను తాకిన బాయ్‌‌కాట్ చైనా

ఇండస్ట్రియలిస్ట్‌‌లను తాకిన  బాయ్‌‌కాట్ చైనా

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెట్ ప్లేయర్లను ఇప్పటికే తాకిన బాయ్‌‌కాట్ చైనా ఉద్యమం తాజాగా టాప్ ఇండస్ట్రియలిస్ట్‌‌లు, బిలీయనీర్ల వద్దకు చేరింది. ఇండియాలో అతిపెద్ద ట్రేడర్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సెయిట్‌‌) దేశంలోని టాప్ 50 ఇండస్ట్రియలిస్ట్‌‌లకు ఒక లెటర్‌‌ రాసింది. వీరిలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, సునిల్‌ మిట్టల్‌, అజీమ్ ప్రేమ్‌‌జీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహింద్రాలున్నారు. బాయ్‌‌కాట్ చైనా క్యాంపెయిన్‌‌కు మద్దతు ఇవ్వాలని, తమ వ్యాపారాల కోసం చైనా నుంచి దిగుమతి చేసుకునే పార్ట్‌‌లు ఆపివేయాలని సెయిట్‌‌ ఇండస్ట్రియలిస్ట్‌‌లను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత, ఇండియాలో యాంటీ చైనీస్ ప్రొడక్ట్‌‌ల క్యాంపెయిన్‌‌ ముందుకు వచ్చింది. చైనాలోని వుహాన్ ప్రావిన్స్‌‌లో పుట్టిన కరోనా వైరస్‌‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ తీవ్రంగా దెబ్బతింది. ఇండియాతో పాటు చాలా దేశాలు సప్లయి చెయిన్‌‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

దీని తర్వాత ఇండియా–చైనా సరిహద్దులో తలెత్తిన టెన్షన్లతో, భారతీయుల్లో బాయ్‌‌కాట్ చైనా ఉద్యమం మరింత ముదిరింది. ‘మిమ్మల్ని సక్సెస్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌గా ఇండియన్ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇండియా ఇండస్ట్రీకి మిమ్మల్ని కెప్టెన్‌‌లుగా ఫీలవుతున్నారు. ఈ క్యాంపెయిన్‌‌లో మీరు పాలుపంచుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాం. ఉధృతంగా సాగుతున్న ఈ ఉద్యమానికి మీరు పూర్తి సపోర్ట్ ఇవ్వండి. ఇది గేమ్ ఛేంజింగ్ ఇనీషియేటివ్‌‌గా నిలువనుంది. గ్లోబల్‌‌గా చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ఇండియా జర్నీ పూర్తిగా మారిపోనుంది’ అని సెయిట్‌‌ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్‌‌వాలా ఇండస్ట్రియలిస్ట్‌‌లకు రాసిన లెటర్లో పేర్కొన్నారు. ఈ మూవ్‌‌మెంట్‌‌లో పాల్గొనేందుకు మీ ఆర్గనైజేషన్ల వద్ద పలు ఆప్షన్లు ఉంటాయని చెప్పారు. దేశం ముందు ఏదీ ఎక్కువ కాదని చూపించడానికి ఇదే గొప్ప అవకాశమన్నారు. ఈ ఇనీషియేటివ్‌‌ మిగిలిన ఇండస్ట్రియలిస్ట్‌‌లకు ప్రోత్సాహం అందించనుందని, ఇండియాను సెల్ఫ్ డిపెండెంట్ భారత్‌‌గా మార్చనుందని చెప్పారు.

లక్ష కోట్ల దిగుమతులు తగ్గించాలనే లక్ష్యం…

చైనా నుంచి నాలుగు కేటగిరీల వస్తువులను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. వీటిలో ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్, స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌, టెక్నాలజీ ప్రొడక్ట్‌‌లు ఉన్నాయి. క్రమక్రమంగా చైనీస్ గూడ్స్‌‌ను బాయ్‌‌కాట్ చేసేలా ఆర్గనైజేషన్లు నిర్ణయించుకోవాలని సెయిట్‌‌ చెప్పింది. తొలి దశలో ఫినిష్డ్ ప్రొడక్ట్‌‌లను బాయ్‌‌కాట్ చేయాలని తెలిపింది. ఇండియాలో తయారు అవుతున్న ప్పటికీ 450 బ్రాండ్లకు చెందిన మూడు వేలకు పైగా ఫినిష్డ్‌‌ ప్రొడక్ట్‌‌లను చైనా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. 2021 డిసెంబర్ నాటికి చైనా నుంచి రూ. లక్ష కోట్ల దిగుమతులను తగ్గించుకోవాలని ఈ బాయ్‌‌కాట్ చైనా ఉద్యమం లక్ష్యంగా పెట్టుకుంది. చైనా నుంచి ఇండియా ఏటా 65.26 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. స్మార్ట్‌‌ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటో మొబైల్స్ వంటి రంగాలు ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం